Uday Kiran | ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోగా మారిపోవడంతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ అలాంటి ఉదయ్ కిరణ్ (Uday Kiran) అవకాశాలు రాక డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే కొంతమందేమో ఆయననే ఆత్మహత్య చేసుకున్నారంటే,మరి కొంతమందేమో ఆయనకు అవకాశాలు రాకుండా చేయడం వల్లే ఆయన అలా చనిపోయారు అని అంటుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ భార్య విశిత గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..ఉదయ్ కిరణ్ విషిత (Vishitha) ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కానీ ఉదయ్ కిరణ్ చనిపోయాక వాళ్ళ అక్క ఫ్యామిలీ గొడవల వల్లే మా తమ్ముడు చనిపోయాడని, మాకు విషిత మీదే అనుమానం ఉంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ వాటిపై విషిత స్పందించలేదు. దీంతో అంతా విషిత నే అనుమానించారు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుంది. అయితే పెళ్లి చేసుకోక ముందు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసేది.
ఇక ఉదయ్ కిరణ్ చనిపోయాక చాలా సంవత్సరాలు అతన్ని తలుచుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది.కానీ కొన్ని సంవత్సరాలకి ఆ బాధ నుండి తేరుకొని మళ్లీ తన పనిలో బిజీ అయింది. అయితే ఉదయ్ కిరణ్ ని బతికించుకోవడానికి విషిత చాలానే ప్రయత్నాలు చేసిందట. అంతేకాదు కౌన్సిలింగ్ కూడా ఇప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఓ రోజు ఆమె లేని టైంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారట. అలాగే విషిత ఉదయ్ కిరణ్ (Uday Kiran) చనిపోయాక ఇప్పటికి కూడా రెండో పెళ్లి చేసుకోకుండా జాబ్ చేసుకుంటూ సెలవులు దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు వెళ్లి విరాళాలు ఇస్తుంది. ప్రస్తుతం విషిత చేస్తున్న పని గురించి తెలిసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.