YS sharmila | YSR పేరు నిలబెడతాడు అనుకున్నా. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. జగన్.. ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారు. జగన్ ఆన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ.
వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు. ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు. వైఎస్సార్ ప్రజల మనిషి. ప్రజల మధ్యే బ్రతికాడు. ఇప్పుడు జగన్ ఒక నియంత. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. ప్రజలకు కనపడరు. ఎమ్మెల్యేలను కలవరు.
మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు..? ఏపీని, నా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ అన్న కారణం దానికి సాక్ష్యం దేవుడు. నా తల్లి విజయమ్మ’ జగన్ కోసం నెలల తరబడి 3,200 కి.మీ పాదయాత్ర చేశానని, సమైక్యాంధ్రకోసం కూడా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఎప్పుడు అవసరమొచ్చినా పార్టీకి అండగా నిలబడ్డ. జగనన్న గెలుపు కోసం స్వలాభం చూసుకోకుండా ప్రచారం చేశా’ నని వెల్లడించారు.
చిరు చేసిన పనికి భయంతో వణికిపోయిన రామ్ చరణ్..
రాజశేఖర్రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా. వైఎస్ ఆశయాలు నిలబెడతారని జగన్ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు. వైఎస్ వారసులమని చెప్పడం కాదు. పనితీరులో కనబడాలని సూచించారు. సీఎం అయిన రోజు నుంచి జగన్ మోహన్ రెడ్డి మారిపోయారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి రైతులను నెత్తినపెట్టుకుని పనులు చేశారని, నాడు వ్యవసాయం పండుగగా ఉంటే నేడు జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మారిందని విమర్శించారు.