YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే ఓ ఆగంతకుడు జగన్పై రాయిని విసిరారు. అత్యంత వేగంగా వచ్చిన రాయి.. జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై తగిలింది.
జగన్తో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. ఏపీ సీఎం జగన్కు వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అయితే జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు.
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది.తన అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్కు వైద్యులు సూచనలు చేశారు. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.
Recent Posts
- SS Rajamouli | భార్యతో రాజమౌళి డాన్స్ అదరగొట్టాడు
- Divya Bharati | అందాల తార దివ్య భారతి మరణానికి కారణం ఇదే.
- YS Sharmila | మా అన్న సహా వైకాపాకు ఓటెయ్యకండి.. షర్మిల షాకింగ్ కామెంట్స్.