KTR | కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఇరవై అయిదేళ్లను చూసుకుంటే మనకు గుర్తుకు వచ్చేది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే అన్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ ఇమేజ్ అనీ అన్నారు.
ఇక కేసీఆర్లో ఈ రెండూ కనిపిస్తాయన్నారు. కేసీఆర్ అంటే ప్రో అర్బన్, ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ ఉంటాయన్నారు.అలాగే చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబుకు మోదీ కంటే చిన్న వయస్సు. చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సత్తా ఉంది.
శాంతిభద్రతల నేపథ్యంలోనే ఆందోళనల విషయంలో.. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నా. చంద్రబాబు అరెస్ట్ విషయంలో నా వ్యాఖ్యలు తప్పుగా జనంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్కల్యాణ్తో రెగ్యులర్గా టచ్లో ఉంటా.చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను అర్థం చేసుకున్నా. చంద్రబాబు, లోకేశ్ విషయంలో మాకు సోదరభావం ఉంది’’ అని కేటీఆర్ అన్నారు.