Mahesh | దేవుడివి సామి నువ్వు… తండ్రి వర్ధంతి రోజే మహేష్ బాబు సంచలన నిర్ణయం.

Mahesh

Mahesh | మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి థియేటర్లోకి తీసుకొచ్చేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం షూటింగ్‌ను శర వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా అంటూ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చిన సంగతి తెలిసిందే.సినిమా సంగతి పక్కన పెడితే సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి నవంబర్ 15న జరిగింది.

మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సోషల్ మీడియాలో తండ్రి ఫోటోను షేర్ చేసి, ‘ఎప్పటికీ సూపర్ స్టార్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే తన తండ్రి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, 40 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ఇవ్వాలని మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ ఎడ్యుకేషనల్ ఫండ్పేరిట 40 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం ఈ స్కాలర్షిప్ అందజేయాలని సూపర్ స్టార్ మహేష్ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం కాస్త బయటికి రావడంతో మహేష్ మరోసారి శ్రీమంతుడు అనిపించుకున్నారంటూ పలువురు ఆయనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం ఈ విషయం తెలిసి ‘మహేష్ అన్నా, నువ్వు చాలా గ్రేట్’, ‘ సూపర్ స్టార్ మహేష్ బాబుని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

https://youtu.be/VmxE4GMeHZU

Leave a Reply