Nara lokesh 200Days | లోకేష్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు.. లోకేష్ త‌ల్లి ఎమోష‌న‌ల్ కామెంట్స్,

Nara lokesh 200Days: నారాలోకేష్ యువగలం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200 వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. తల్లి భువనేశ్వరి కూడా నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నారు.200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెం లో గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Nara lokesh 200Days
Nara lokesh 200Days

గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు. 200 రోజుల పాదయాత్ర సందర్భంగా లోకేష్ కి శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలు జంగారెడ్డి గూడెం చేరుకున్నారు.జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేష్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనపై ఘాటు విమర్శలు చేశారు.

అది పక్కన పెడితే తల్లి భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు వడ్డీ పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం భువ‌నేశ్వ‌రి చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Leave a Reply