రాకేష్ మాస్టర్ చివరిసారి చూసి కన్నీరు పెట్టిన శేఖర్ మాస్టర్..!

టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ నిన్న సాయంత్రం మరణించారు. అయన మరణవార్త ఇండస్ట్రీలోని డాన్సర్స్ ని తీవ్రంగా బాధిస్తుంది. ఇండస్ట్రీకి వద్దామనుకున్న ఎంతోమందికి ఆయన చేయూతను అందించారు. తన ఇంటిలోనే పెట్టుకొని ఎంతోమందికి అన్నం పెట్టారు. ఇప్పుడు ఆయన చనిపోయారు అంటే ఆ సహాయం అందుకున్న వారి మనసు కన్నీరు పెడుతుంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు.అయితే శేఖర్ మాస్టర్ పై రాకేశ్ మాస్టర్స్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

వారి ఇద్దరి మధ్య ఏమి గొడవ అయ్యిందో మాత్రం తెలియలేదు. ఈ విషయం పై శేఖర్ మాస్టర్ కూడా స్పందించడానికి నిరాకరిస్తుంటాడు. దీంతో ఇప్పుడు రాకేశ్ మాస్టర్ పార్ధివదేహాన్ని చూడడానికి శేఖర్ మాస్టర్ వస్తాడా? అని అందరిలో సందేహం మొదలయింది.

అయితే రాకేశ్ మాస్టర్ ని కడసారి చూసేందుకు శేఖర్ వచ్చారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a Reply