Udayabhanu | యాంకర్ ఉదయభాను కవల పిల్లలు జ‌న‌గ‌ణ‌మ‌న‌ని ఎంత బాగా పాడారో చూడండి..!

Udaya Bhanu | ఆర్.నారాయణ మూర్తి హీరోగా నటించిన ‘ఎర్ర సైన్యం’ చిత్రంతో నటిగా కెరీర్ ను ప్రారంభించింది ఉదయ భాను. ఆ తరువాత ‘బస్తీ మె సవాల్’ ‘కొండవీటి సింహాసనం’ ‘ఖైదీ బ్రదర్స్’ ‘శ్రావణమాసం’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపుని యాంకర్ గా రాబట్టుకుంది ఉదయభాను. ‘వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చెయ్యరా డింబకా’ వంటి షోలతో క్రేజ్ ను సంపాదించుకుంది.

నిజానికి యాంకర్లు కూడా గ్లామర్ షో చెయ్యొచ్చు అని..అప్పటి వరకూ ఉన్న బోర్డర్ ను చెరిపేసింది కూడా ఉదయ భాను నే అని చెప్పాలి. అయితే ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది.దానికి కారణం ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. నిజానికి ఉదయభాను తనకు కవల పిల్లలు పుట్టిన తర్వాత నుండీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం వారి బాగోగులు చూసుకుంటూ.. అదే తన ఆనందం అంటూ చెబుతుంది ఈ యాంకర్.

2016లో ఉదయభానుకి కవలలు జన్మించారు.వీరి పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర.. ! అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో వీరి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఉదయభాను. 2004 లో విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత పలు షోలకు యాంకర్ గా చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు పిల్లల కారణంగానే ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి ఇష్టపడుతోందట.అయితే నిన్న ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆమె పిల్ల‌లు జ‌న‌గ‌ణ‌మ‌న జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆల‌పించిన వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.నచ్చితే కింద కామెంట్ చేయండి.

Leave a Reply