Upasana | మెగా కోడలిగా, రామ్ చరణ్ భార్యగా ఉపాసన ఎంత మంచి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా బయటకు, మీడియా ముందుకు రాకపోయినా ఇప్పుడు మాత్రం ఉపాసన రెగ్యులర్ గా ఏదో ఒక మంచి వార్తతోనే రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఉపాసన.అలాగే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాప పుట్టినప్పటి నుండి పాప ఆలనా పాలనా చూసుకుంటూ చాలా ఆనందకరమైన జీవితం గడుపుతుంది ఉపాసన.
తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ సింగిల్ మదర్స్ కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది ఉపాసన. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామని చెప్పింది. నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారు..
పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో పేరెంట్స్ వద్దకు చేర్చడం మా బాధ్యత. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని . పిల్లలకు అనారోగ్యానికి గురయితే ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతారో నాకు తెలుస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ఇబ్బందిపడడం నేను చూశాను.
కొందరు మహిళలు నా దగ్గరకి వచ్చి బాధ చెప్పుకోగా, అది విని చాలా బాధపడ్డాను.అలాగే గర్భంతో ఉన్న సమయం నుంచి డెలివరీ వరకు సాగిన జర్నీ మరచిపోలేనిదని.. ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఉపాసన చెప్పింది. ఇప్పుడు అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు చాలా ఎమోషనల్ జర్నీ అని పేర్కొంది.