Allu Aravind | అమ్మో .. కోట్లు విలువచేసే లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..

Allu Aravind | అరవింద్ (Allu Aravind) తాజాగా మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అల్లు అరవింద్.. 1972లో గీతా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. మరెన్నో సినిమాలను పంపిణీ చేశారు. కొన్నేళ్ల క్రితం బన్నీ వాసుతో కలిసి గీతా ఆర్ట్స్ 2 పేరుతో మ‌రో బ్యానర్ ను కూడా స్టార్ట‌ట్ చేసి యువ హీరోలను ప్రోత్సహిస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ సక్సెస్ అయిన అల్లు అర‌వింద్‌.. వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు.

మరోవైపు ఆహా పేరుతో ఓటీటీ సమస్థను స్థాపించారు. ప్రేక్షకుడి పల్స్ తెలిసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ సక్సెస్ కి కేరాఫ్ గా మారారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న అల్లు అరవింద్ తాజాగా తన గ్యారేజ్ లోకి ఓ లగ్జరీ కారును ఆహ్వానించారు. ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ వ‌ల్ల నాలుగు నుంచి ఐదు కార్లు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా ఆయ‌న బీఎమ్‌డ‌బ్లూ ఐ7 అనే ఈవీ (క‌రెంట్) కారును కోనుగోలు చేశారు.

allroudadda
allroudadda

షో రూం నిర్వాహ‌కులు తాజాగా కారును అల్లు అర‌వింద్ ఇంటికి హోం డెలీవ‌రీ చేశారు. దాంతో అల్లు అర‌వింద్ త‌న భార్య‌తో క‌లిసి కొత్త కారు ప‌క్క‌న నిల‌బ‌డి ఫోటోల‌కు పోజులిచ్చారు. అలాగే వైఫ్‌ను కూర్చోబెట్టుకుని కారు న‌డిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక అల్లు అర‌వింద్ కొన్న బీఎమ్‌డ‌బ్లూ ఐ7 ఖారు ధ‌రెంతో తెలిస్తే మ‌తిపోతుంది. ఈ ల‌గ్జ‌రీ కారును ఆయ‌న రూ. 2.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశార‌ట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎంతైనా అల్లు అర‌విందా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా, అల్లు అర‌వింద్ ప్ర‌స్తుతం త‌న హోమ్ బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్ పై తండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డబ్బు కోసం 12 ఏళ్లలో నగ్మా చేసిన పని తెలిస్తే.. దేవుడా

ఇందులో యువ‌సామ్రాట్ నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. మత్యకారుల జీవితాల నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. లవ్ స్టోరీ వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం నాగ చైతన్య – సాయి పల్లవి రెండోసారి తండేల్ మూవీలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న తండేల్ మూవీ 2024 ఎండింగ్ లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తాయి.

Recent Posts

Leave a Reply