భరతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్-3’ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ‘సాఫ్ట్ ల్యాండ్’ అయింది.ఈ అపూర్వమైన.. సాటిలేని విజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. భూమి సహజ ఉపగ్రహం (చంద్రుడు) ఈ భాగంలో దిగిన ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా అవతరించింది. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్ళిన అన్ని మిషన్లు చంద్ర భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా కొన్ని డిగ్రీల అక్షాంశంలో దిగాయి.
మొదట చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యునైటెడ్ స్టేట్స్, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత అరుదైన ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలవనుంది. ఇస్రో అధికారుల ప్రకారం, లిఫ్ట్ ఆఫ్ అయిన 16 నిమిషాల తర్వాత, ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుండి విడిపోతుంది.
భూమికి 170 కిమీ దగ్గరగా, 36,500 కిమీ దూరంలో చంద్రుని వైపు కదులుతూ దీర్ఘవృత్తాకార చక్రంలో భూమి చుట్టూ 5-6 సార్లు తిరుగుతుంది.చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు.. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి. చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్ను మాత్రమే ఉపయోగిస్తారు. చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు.