CM YS Jagan | ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. పాపం, ముఖ్యమంత్రి జగన్ పేదవాడు అని జాలి చూపించారు. ప్రత్యేకమైన విమానంలో లండన్ వెళ్ళాడని అన్నారు. రూ.40 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడని చెప్పారు. కూతురిని చూసేందుకు ముఖ్యమంత్రి జగన్ 40కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్.. పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా? రాబోయే రోజుల్లో పేటీఎం బ్యాచ్ కి బుద్ధి చెబుతాం. గతంలో నిధులు మంజూరు చేసినా అభివృద్ధి పనులు పూర్తి చేయరు. పేదవాడి కూతురు ప్రేమకి రూ.40 కోట్లు ఖర్చు. ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.అది పక్కన పెడితే వైఎస్ జగన్ లండన్ పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం జగన్, భారతి దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లారు.
అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు ఈ దంపతులు ఇద్దరు వెళ్లగా, లండన్ నుంచి తిరిగి ఈ నెల 12న వస్తారు.. తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయినట్టు తెలుస్తుండగా, స్నాతకోత్సవం కార్యక్రమంలో జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. కూతురు సాధించిన ప్రతిభ పట్ల జగన్ చాలా హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుతో పెట్టుకోవద్దు జగన్.. చాలా ఇబ్బంది పడతావు..
నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నీకు దేవుడు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నా అని జగన్ అన్నారు. ఇక ప్రస్తుతం జగన్ తన ఫ్యామిలీతో కలిసి చాలా సందడిగా టూర్ వేస్తున్నారు. జగన్ టూర్ పిక్స్ మాత్రం ఏవి బయటకు రావడం లేదు. కూతురితో కలిసి ఆయన సరదాగా గడుపుతున్నట్టు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: అన్నం తిన్నాక ప్లేట్లోనే చేయి కడుగుతున్నారా..?