Miss India | 28 ఏళ్లకే విశ్వసుందరి మృతి.

allroudadda

Miss India | మాజీ మిస్‌ ఇండియా త్రిపుర రింకీ చక్మా (Rinky Chakma) కన్నుమూశారు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌ (Cancer)తో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం రింకీ వయసు 28 ఏళ్లు.త్రిపురకు చెందిన రింకీ చక్మా.. 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచారు. రెండేళ్ల క్రితం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకోసం ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. మొదట తగ్గినప్పటికీ.. ఆతర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించింది.

వ్యాధి క్రమంగా ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 22న తీవ్ర అస్వస్థతకు గురైన రింకీని కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.“ఈ క్లిష్ట పరిస్థితుల్లో రింకీ చక్మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఆమె ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాం. రింకీ అందం యొక్క ప్రయోజనం, వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ గురించి తెలుసుకునే అవకాశం ఉన్న వారందరూ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు”ని ఫెమినా మిస్ ఇండియా పేర్కొంది.

allroudadda
allroudadda

కాగా, తాను క్యాన్సర్ బారిన విషయాన్ని గత నెలలో రింకీ చక్మా బయట ప్రపంచానికి వెల్లడించారు. రెండేళ్ల క్రితం తనకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా తెలిపారు. చాలా కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదని పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి అందరికీ చెప్పే సమయం వచ్చిందని భావించి ఈ విషయాన్ని బయట పెడుతున్నట్టు చెప్పారు.

Recent Posts

Leave a Reply