Tollywood | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..స్టార్ నటుడు కన్నుమూత..!!

సినీ ఇండస్ట్రీ

Tollywood | ఇటీవల తరచూ సినీ, రాజకీయ రంగాల్లో విషాదం చోటుచేసుకుంటుంది. వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు మరణించారు. గుండెపోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదం వంటి ఇతర కారణాలతో మరణిస్తున్నారు. ఇలా ప్రముఖల మరణాలు.. వారి కుటుంబాలతో పాటు వారి అభిమానలను విషాదంలోకి నెట్టుతున్నాయి. గత వారమే ప్రజా నాయకుడు గద్దర్ అనారోగ్యంతో మరణించారు. దీంతో యావత్తు తెలంగాణ విషాదంలో మునిగిపోయింది.

తాజాగా జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా వచ్చిన సినిమా బలగం. పల్లెటూరి అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందుతూ నిర్మాతలకు లాభాల పంట పండించింది.మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నర్సింగం కన్నుమూశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు తెలుపుతూ..

మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి అని ట్వీట్ పెట్టారు.బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం అని వేణు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply