AP 10Th ఫలితాల్లో సంచలనం.. 600లకు ఏకంగా 599 మార్కులు..

AP 10Th | పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఎదురుచూసిన తరుణంలో నేడు రిలీజ్ అయ్యియి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది టెన్త్ విద్యార్థుల భవితవ్యం తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సోమవారం(ఏప్రిల్ 22)నాడు టెన్త్ ఫలితాలను ప్రకటించింది. కాగా ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ మార్కులతో అదరగొట్టారు.

పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపి ఆల్ టైమ్ రికార్డ్ మార్కులను పొందారు.. ఈ పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు.ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.32 శాతం మంది పాసయ్యారు. 96.37 శాతంతో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది.

అయితే ఈ ఫలితాల్లో ఓ విద్యార్థినికి 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతి పరీక్షలో 100, 99, 100, 100, 100, 100 మార్కులు సాధించింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించింది.

నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన మనస్వీకి చదవంటే ఎంతో ఇష్టమట. ఏదో చదివాం అన్నట్లు బట్టీ పట్టి కాకుండా టాపిక్ను అర్థం చేసుకోవడం ఈ విద్యార్థినికి అలవాటట. అందుకే ఇంత మంచి మార్కులు సాధించింది. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్‌, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్‌ కూడా ఎంతగానో పనికొచ్చిందని మనస్వీ చెప్పింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

Recent Posts

Leave a Reply